Toyota Kirloskar | దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు సెమీ కండక్టర్ల కొరత నుంచి కోలుకున్నట్లు కనిపించట్లేదు. 2020తో పోలిస్తే గత నెల వాహనాల విక్రయాల్లో పురోగతి సాధించినా.. సెమీ కండక్టర్ల కొరత వల్ల అది తక్కువేనని అంగీకరించాయి. ఈ నెలలోనూ దీని ప్రభావం కనిపించనున్నది. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా తర్వాత టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఆ బాటలో పయనిస్తున్నది.
చిప్లు, సెమీ కండక్టర్ల కొరత వల్ల ఈ ఏడాదిలో మూడు లక్షల వాహనాల ఉత్పత్తి తగ్గించనున్నట్లు ప్రకటించింది టయోటా కిర్లోస్కర్ మోటార్స్. దీని ప్రకారం సెప్టెంబర్లో 70 వేల వాహనాల ఉత్పత్తి తగ్గనున్నట్లు సమాచారం. ఒక్క జపాన్లోనే 1.5 లక్షల యూనిట్లు, ఇతర దేశాల్లో 40 వేల కార్ల ఉత్పత్తి తగ్గుతుంది. వచ్చే నెలలో జపాన్లో 30 వేలు, మిగతా దేశాల్లో 1.8 లక్షల యూనిట్ల కార్ల ఉత్పత్తి తగ్గిపోనుంది. కర్ణాటకలోని బిదాడి యూనిట్లో ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడనున్నదని తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
IT Returns | బిగ్ రిలీఫ్.. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించిన కేంద్రం
RBI rule on ATM | గ్రామీణులకు షాక్.. ఏటీఎంలు ఎత్తేస్తున్న బ్యాంకులు?!