నూఢిల్లీ, మార్చి 9: ప్రముఖ ఎడ్యుకేషన్ స్టార్టప్ వేదాంతు వ్యాపారాన్ని విస్తరిస్తున్నది. ఇందుకోసం వచ్చే మూడు నెలల్లో మరో 2,500 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ప్రొడక్ట్, టెక్నాలజీ, అకాడమి, బిజినెస్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న బీ-స్కూళ్ళు, ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ల్లో విధులు నిర్వహిస్తున్న ఎంట్రిలెవల్, మధ్యస్థాయి సిబ్బందిని తీసుకోనున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది.