ముంబై, జూలై 5: విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహన స్టార్టప్ సింపుల్ ఎనర్జీ.. తమ ప్రతిష్ఠాత్మక ఈ-స్కూటర్కు ‘సింపుల్ వన్’గా పేరు పెట్టింది. ఆగస్టు 15న ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ను హైదరాబాద్ మార్కెట్కు పరిచయం చేయనున్నది. సంస్థ నుంచి తొలి ఎలక్ట్రిక్ వెహికిల్గా వస్తున్న సింపుల్ వన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే గరిష్ఠంగా 240 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సింపుల్ ఎనర్జీ వెల్లడించింది. ధరల శ్రేణి దాదాపు రూ.1.10 లక్షల నుంచి 1.20 లక్షల వరకు ఉన్నది.