ఒకప్పుడు ఆ గ్రామ రోడ్లు అధ్వానం ఉండేవి.. ఇప్పుడు గల్లీగల్లీనా సీసీతో అందంగా కనిపిస్తున్నవి.. పల్లె ప్రకృతిలో భాగంగా ఔరా! అనిపించేలా చిట్యాల గ్రామం మారింది. ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉండగా, ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నది. రైతువేదిక.. డంపింగ్యార్డు.. నర్సరీ.. వైకుంఠధామం.. హరితహారం మొక్కలు.. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు.. పారిశుధ్య నిర్వహణతో గ్రామం ఆదర్శంగా మారింది.
మెదక్ రూరల్, జూలై 6 : పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పచ్చదనం.. పరిశుభ్రతతో కళకళలాడుతున్నది.. ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని, మెదక్ మండలం చిట్యాల గ్రామం ఆదర్శంగా మారింది. గ్రామంలో 1223 మంది జనాభా ఉండగా, 300 నివాసగృహలు, 8వార్డులు ఉన్నాయి. పల్లె ప్రగతిని ఉపయోగించుకొని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పంచాయతీ పాలకవర్గంతో పాటు ప్రజాప్రతినిధులు ముందుకు సాగుతున్నారు. ఎంపీపీ, అధికారులు, వార్డు మెంబర్లు తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని, ఆకుపచ్చ, పరిశుభ్ర గ్రామంగా తీర్చదిద్దడానికి కృషి చేస్తున్నారు. గ్రామంలో వైకుంఠధామం నిర్మిస్తున్నారు. పంచాయతీలో పారిశుధ్యం లోపించకుండా డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్డు నిర్మించారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలు ఏర్పాటు చేశారు. పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి, డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ వెళ్లని వీధిలో రిక్షాలు పంపుతున్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పడుతున్నారు. దీంతో గ్రామం పచ్చగా మారి, కళకళలాడుతున్నది. గ్రామంలో రెండు మిషన్ భగీరథ ట్యాంకులు ఏర్పాటు చేసి, 260 నల్లా కనెక్షన్లతో ఇంటింటికీ శుద్ధ జలం అందిస్తున్నారు. దీంతో గ్రామస్తుల నీటి కష్టాలు దూరమయ్యాయి. రోజువారీ పనులు నిరాటంకంగా సాగుతుండడంతో కొత్తరూపును సంతరించుంది.
ఆహ్లాదకరంగా హరితహారం మొక్కలు..
హరితహారంలో భాగంగా గ్రామంలో ఇప్పటివరకు 3500మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు పెద్దగా మారి, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మొక్కలకు వాటర్ ట్యాంకుల సహాయంతో ప్రతిరోజు నీటిని పడుతున్నారు. గ్రామ నర్సరీలో ప్రస్తుతం 10వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పల్లెప్రకృతి వనంలో రకరకాల మొక్కలు ఏర్పాటు చేశారు.
నిధులు ఇలా
రూ. 2.50లక్షలతో డంపింగ్యార్డు
రూ. 12లక్షలతో వైకుంఠధామం
రూ.5లక్షలతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం
రూ.5.20లక్షలతో పంచాయతీకి ట్యాంకర్, ట్రాక్టర్
రూ.1.60లక్షలతో ట్రాలీ కొనుగోలు
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా..
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పల్లెప్రగతితో చిట్యాలకు కొత్త శోభ సంతరించుకుంది. ప్రజలు, వార్డు మెంబర్ల సహకారంతో ప్రణాళిక ప్రకారం ఖర్చు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పంచాయతీలకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ వంటివి ఉపయోగపడుతున్నాయి. పల్లెప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది.
మా హయాంలో మారడం సంతోషం
పల్లెప్రగతికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించడం మా అదృష్టం. మా హయాంలో గ్రామాల రూపురేఖలు మారడం సంతోషంగా ఉంది. గ్రామంలోని ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ప్రతి వీధిలో సీసీ రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ భగీరథ నీరందిస్తున్నాం. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసుకుంటున్నాం.
పల్లె పరిశుభ్రంగా మారింది..
పల్లె ప్రగతితో పల్లె రూపు రేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రతి పంచాయతీకి కొత్త ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఇవ్వడంతో పారిశుధ్య నిర్వహణ బాగైంది. సీజనల్ వ్యాధులు రాకుండా రసాయనాలు పిచికారీ చేస్తున్నాం. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్తో నీళ్లు పోస్తున్నాం. గ్రామాల్లో రోజువారీ పనులు నిరాటంకంగా సాగుతుండటంతో గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయి.