హైదరాబాద్, జూన్ 22: కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో ఓ యూనిక్ ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించారు. కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్కు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల బృందం, కొందరు యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కలిసి ఈ సరికొత్త ఈ-బైక్ను తయారు చేసినట్లు మంగళవారం వర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇందులోని సెల్ బ్యాలెన్సింగ్, వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండటం గమనార్హం.