కేవలం గంటసేపు బ్యాటరీ చార్జింగ్తో 20 కిలోమీటర్లు ప్రయాణించగల సైకిల్ను రూపొందించాడు వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురానికి చెందిన ముప్పారపు రాజు. డీసీ మోటర్, బ్యాటరీ సహాయంతో దీన్ని తయారు చేశాడు. వరల్డ్ సైకిల్ డేను పురస్కరించుకొని ఆ సైకిల్ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ ముందు ప్రదర్శించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు, ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేస్తున్నారంటూ రాజును ప్రశంసించారు.
వరంగల్,నమస్తే తెలంగాణ ప్రతినిధి