ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1.85 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, జూన్ 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.85 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్ళు అయినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో వసూలైన దాంతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికమని పేర్కొంది. దీంట్లో కార్పొరేట్ ఆదాయ పన్ను కింద రూ.74,356 కోట్లు వసూలవగా, వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీ ట్రాన్స్క్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) కింద రూ.1.11 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు ఏడాది క్రితం వసూలైన రూ.92,762 కోట్లతో పోలిస్తే 100 శాతం అధికమని సీబీడీటీ తాజాగా వెల్లడించింది. అలాగే రూ.30,731 కోట్ల రిఫండ్ చెల్లింపులు జరిపినట్లు తెలిపింది.