5G Spectrum | 5జీ స్పెక్ట్రం వేలం, క్వాంటం దాని ధరపై అభిప్రాయాలు చెప్పాలని ట్రాయ్ను టెలికం శాఖ (డాట్- డీవోటీ) కోరింది. దీనిపై విధి విధానాల రూపకల్పనకు సూచనలు చేయాలని కోరింది. త్వరలో 5జీ స్పెక్ట్రం వేలం నిర్వహించడానికి టెలికం శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇంతకుముందు గత మార్చిలో 855.6 ఎంహెర్ట్జ్ స్పెక్ట్రం వేలం కోసం రూ.77,800 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి.
ఈ విషయాన్ని ట్రాయ్ సెక్రటరీ వీ రఘునాధన్ ధృవీకరించారు. 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి విధి విధానాల రూపకల్పనపై సూచనలు చేయాలని టెలికం శాఖ నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఇతర వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.