దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకాయి. గడిచిన ఏడాది కాలంలో మదుపరులకు 125 శాతం రాబడిని ఈక్విటీ మార్కెట్లు అందించాయి. అయితే సమీప భవిష్యత్తులోనూ ఇంతే స్థాయిలోరాబడులు వచ్చే అవకాశాలు తక్కువే. మార్కెట్లో లాభాల స్వీకరణ కారణంగా భారీ కరెక్షన్కు కూడా అవకాశాలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో రిస్క్ తక్కువగా ఉండే పెట్టుబడి మార్గం ఏమిటి?.. షేర్లలోనే కాకుండా ఇతర అసెట్లలో కూడా మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయా?.. ఈ ప్రశ్నలకు సమాధానమే రెండు కన్నా ఎక్కువ అసెట్లలో మదుపు చేసే మల్టీ అసెట్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్స్.
గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో దాచరాదనేది పొదుపు-మదుపు మంత్రం. అన్ని ఆర్థిక సాధనాలు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉత్థానపతనాలకు గురవుతుంటాయి. వీటిని ముందుగానే గుర్తించి పతనం అయ్యే అవకాశాలున్న వాటిలో కాకుండా, మిగతా వాటిలో మదుపు చేసేవే మల్టీ అసెట్ ఫండ్స్, ఇందులో ఈక్విటీలు, రుణ సాధనాలు, కమోడిటీస్ ఇలా వివిధ రకాల సాధనాల్లో మదుపు చేస్తూ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భద్రత కల్పిస్తూ రాబడిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఉదాహరణకు బంగారంలో పెట్టుబడి ఆర్థిక సంక్షోభం రిస్క్ నుంచి కాపాడుతుంది. ఇదొక సంప్రదాయ సేఫ్ అసెట్ క్లాస్. రుణ సాధనాల్లో పెట్టుబడులు.. రెగ్యులర్గా ఆదాయం అందించడంతోపాటు స్థిరంగా ఉంటాయి. అన్నిటి కన్నా ముఖ్యంగా క్యాపిటిల్ భద్రంగా ఉంటుంది. ఈక్విటీలు స్పల్పకాల ఒడిదుడుకులున్నా దీర్ఘకాలంలో అన్నింటి కంటే అధిక రాబడులను అందిస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం ఈ మల్టీ అసెట్ ఫండ్స్.. ఒక్కో అసెట్ స్కీంలో కనీసం పది శాతం మదుపు చేయాల్సి ఉంటుంది.
మదుపు ఎలా?
ఆన్లైన్లో వివిధ ప్లాట్ఫామ్లలో మదుపు చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో కేవైసీ అప్డేట్ చేసి నేరుగా ఆన్లైన్లోనే మదుపు చేయవచ్చు.
అలాకాకుండా ఆఫ్లైన్లో దరఖాస్తును నింపి సమీప మ్యూచువల్ ఫండ్ బ్రాంచి ఆఫీసులో నమోదు చేయడం ద్వారా కూడా మదుపు చేయవచ్చు.
బెస్ట్ ఫండ్స్ ఏవీ ?
క్వాంట్ మల్టీ అసెట్ ఫండ్ గత ఏడాదిలో 65.03 శాతం రాబడిని ఇచ్చింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ 62.76 శాతం, యాక్సిస్ ట్రిపుల్ అడ్వాంటేజ్ ఫండ్ 49.18 శాతం రాబడులను ఇచ్చాయి. ఇవికాకుండా ఏబీఎస్ఎల్, టాటా మల్టీ అసెట్ ఫండ్, నిప్పాన్ ఇండియా మల్టీ అసెట్ ఫండ్లు సగటున 40 శాతం చొప్పున రాబడిని అందించాయి.
ఆకర్షణీయాంశాలు