హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రముఖ ప్లాస్టిక్ రీసైక్లింగ్, వ్యర్థ నిర్వహణ కంపెనీ శ్రీ చక్ర పాలీప్లాస్ట్.. దేశంలోనే తొలి ఫుడ్-గ్రేడ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది. పోలియోలెఫిన్స్ రీసైక్లింగ్ ప్లాంట్నూ అందుబాటులోకి తెచ్చినట్లు మంగళవారం సంస్థ వెల్లడించింది. ఈ రెండు ప్లాంట్లలో ఫుడ్-గ్రేడ్ నాణ్యత కలిగిన రీసైకిల్డ్ పాలిథ్లీన్ టెరిఫాథలెట్ పెలెట్స్, డియోడరైజ్డ్ బాటిల్ టు బాటిల్ గ్రేడ్ నాణ్యత కలిగిన పోల్యోలెఫిన్ పెలెట్స్ తయారవనున్నాయి. కాగా, ఈ రీసైక్లింగ్ సామర్థ్యాలను పెంచేందుకు దాదాపు రూ.75 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు ఈ సందర్భంగా సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. దీనివల్ల స్థానికంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నది. ఇక ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ను దేశీయ మార్కెట్తోపాటు ఐరోపా, అమెరికా వంటి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నట్లు సంస్థ సీఈవో, సహవ్యవస్థాపకుడు రవీంద్ర వెంకట వెల్లడించారు.