న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పాల ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ..స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది కూడా. ఈ ఐపీవోకి రావడానికి దొడ్ల డెయిరీ ఫిబ్రవరి 15న దరఖాస్తు చేసుకోగా, రెండు నెలల తర్వాత సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 10,085,444 ఈక్విటీ షేర్లను జారీ చేయడంతో రూ.50 కోట్ల వరకు నిధులను సేకరించాలనుకుంటున్నది. ఇలా సేకరించిన నిధులను రుణాలను తీర్చడానికి, వ్యాపార విస్తరణకోసం వినియోగించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నది.