ఢిల్లీ : నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ (ఏఆర్ఎస్) (ప్రిలిమినరీ), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఎస్టీవో) 2021 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్బీ) పొడిగించింది. ఏప్రిల్ 25 గా ఉన్న చివరి తేదీని మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. కొవిడ్-19 కారణంగా అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://asrb.org.in/ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 21 నుండి 27వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ. ఏఆర్ఎస్ మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 19న. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పులు అనుమతించబడవు. అందువల్ల అభ్యర్థులు ఫారమ్ను చాలా జాగ్రత్తగా నింపాలని సూచించారు. దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) విధానంలో 32 సెంటర్లలో పరీక్ష నిర్వహణ.