న్యూఢిల్లీ: భారత్లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, దాని అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్, మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలకు శుక్రవారం రాత్రి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 10.30 గంటల నుంచి ఈ మూడు వేదికల సేవలు పని చేయకపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారత్తోపాటు పలు దేశాల్లో ఈ సంస్థల సేవలు నిలిచిపోయాయి. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది. పలువురు నెటిజన్లు.. ట్విట్టర్ వేదికగా నిరసన తెలిపారు. సుమారు 45 నుంచి గంట సేపటి తర్వాత ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.