తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు అభినందనీయం: మంత్రి మల్లారెడ్డి
ఘట్కేసర్ రూరల్, మార్చి 10: మహిళల భాగస్వామ్యంతో కల్తీలేని, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రజలకు చేరువైన అవుషాపూర్ ఫుడ్స్ను దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ (డిక్కీ) అవార్డు వరించింది. ఈ అవార్డును అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డికి రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అవుషాపూర్ ఫుడ్స్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉందనడానికి డిక్కీ అవార్డు నిదర్శనమని, ఈ అవార్డు అందుకోవడం అభినందనీయమని చెప్పా రు. సేంద్రీయ ఎరువుల ద్వారా పండించిన ధాన్యం, కూరగాయలను పంట పొలాల వద్దే రైతుల నుండి కొనుగోలు చేస్తున్నారని తెలియజేశారు. ఇలా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నందునే అనతికా లంలో గొప్ప గుర్తింపు లభించిందన్నారు.