న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థలు.. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీని మించి వృద్ధిరేటును సాధించాయి. ప్రైవేట్ కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయం 12.68% పెరుగగా, ఎల్ఐసీ కొత్త పాలసీల ఆదాయం వృద్ధి మాత్రం 4 శాతంగానే ఉన్నదని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. రూ.2.78 లక్షల కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నది. కాగా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త వ్యాపార ప్రీమియం 15.36% ఎగిసి రూ.20,242 కోట్లకు చేరింది. అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వృద్ధిరేటు 21.37 శాతంగా ఉండగా, ఆదాయం రూ.20,625.47 కోట్లుగా ఉన్నది. అయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ వృద్ధిరేటు 4.3% పడిపోయింది. ఆదాయం రూ.13,032. 12 కోట్లుగా ఉన్నదని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది.