మూడేండ్ల తర్వాత డెత్ క్లెయిమ్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వద్ద బీమా పాలసీ తీసుకున్న వారి డెత్ క్లెయిమ్స్లు గత ఏడాది ఏప్రిల్- డిసెంబర్ మధ్య కాలంలో 17.11 శాతం పెరిగి 8,16,652కు చేరుకున్నాయి. అంతకు ముందు ఇదే కాలంలో అంటే ఏప్రిల్-డిసెంబర్ 2019లో 6,97,314 డెత్ క్లెయిమ్స్లు జరిగాయి. అయితే కరోనా మరణాల కారణంగా ఎన్ని క్లెయిమ్స్లు వచ్చాయన్న దానిపై స్పష్టమైన డాటా లేదు. వచ్చిన డెత్ క్లెయిమ్స్లలో 8,08,575 సెటిల్ చేసి రూ. 16,945.96 కోట్లను లబ్దిదారుల నామినీలకు చెల్లించింది. కాగా, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అత్యధికంగా 4,50, 849 క్లెయిమ్స్లు రాగా, ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో 1,68,301 క్లెయిమ్స్లు వచ్చాయి. అయి తే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా లాక్డౌన్ ఉన్న కారణంగా క్లెయిమ్స్ తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
మోతిలాల్ ఓస్వాల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కు 5,000 పైగా క్లెయిమ్స్లు వచ్చాయి. వీటిలో అత్యధికంగా కరోనా మరణాలు ఉండటం గమనార్హం. వారికి రూ. 340 కోట్ల మేర డెత్ బెనిఫిట్ కింద చెల్లింపులు జరిపింది. అలాగే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా రూ. 340 కోట్ల మేర డెత్ బెనిఫిట్లను చెల్లించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ 1,271 కోవిడ్ మరణాల క్లెయిమ్లకు రూ. 542 కోట్లను చెల్లించింది. మ్యాక్స్ ఇన్సూరెన్స్ అత్యధికంగా 10,525 డెత్ క్లెయిమ్లు వచ్చాయి.