DA for Central Employees | దీపావళి పర్వదినం ముంగిట్లో ఉండగా, కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మోదీ ప్రభుత్వం మంగళవారం తీపి కబురందించింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం (డీఏ) 28 శాతం నుంచి 31 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం గత జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది. ఏడవ వేతన కమిషన్ సిఫారసులకు అనుగుణంగా కనీస వేతనాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, స్పెషల్ పే తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోరు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నది. సైనిక బలగాలు, డిఫెన్స్ సర్వీసులు, రైల్వే ఉద్యోగులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ మేరకు డిఫెన్స్, రైల్వే మంత్రిత్వశాఖ వేర్వేరు ప్రకటనలు చేస్తాయి.
ఈ ఏడాది జూలైలో కేంద్ర ఉద్యోగుల డీఏను 17 నుంచి 28 శాతానికి కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మూడు శాతం పెంచడంతో ఇప్పుడు మొత్తం డీఏ 31 శాతానికి చేరుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 9,488.70 కోట్ల భారం పడుతుంది.
కరోనా మహమ్మారి వేళ మూడు డీఏలను కేంద్రం స్తంభింపజేసింది. 2020 జనవరి 1, 2020 జూలై 1, 2021 జనవరి 1 తేదీల్లో డీఏ పెంచాల్సి ఉన్నా పెంచలేదు. గత జూలై ఒకటో తేదీన డీఏ పెంపుపై ఉన్న ఆంక్షలను తొలగించింది కేంద్రం.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!