ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రతి ఇంట ఘనంగా జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారే ఉండి ఉగాది సంబురాలు జరుపుకుంటున్నారు. అయితే ప్రతి పండుగకు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారి మూవీస్కు సంబంధించి సర్ప్రైజింగ్ పోస్టర్స్ లేదా వీడియోలు విడుదల చేస్తుంటారు. ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి సెలబ్రిటీస్ తమ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిజేయగా, విరాట పర్వం, గల్లీ రౌడీ, వకీల్ సాబ్, 101 జిల్లాల అందగాడు, గల్లీ రౌడీ చిత్రాల నుండి ఆసక్తికర పోస్టర్స్ విడుదలయ్యాయి.