అక్రమార్కుల గుప్పిట్లో క్రిప్టోకరెన్సీ యూజర్ల డేటా

న్యూఢిల్లీ : భారత్లో క్రిప్టోకరెన్సీ యూజర్లకు సంబంధించిన కీలక డేటా ప్రమాదంలో పడింది. బైయూకాయిన్ యూజర్లతో పాటు ఇతర క్రిఫ్టోకరెన్సీ లో ట్రేడింగ్ చేసే లక్షలాది యూజర్ల బ్యాంకింగ్, కేవైసీ సమాచారం డార్క్ వెబ్ల్లో లీకయిందనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. యూజర్ల పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, మొబైల్ నెంబర్లు, ఆర్డర్ సమాచారం, యూజర్ల డిపాజిట్ హిస్టరీ అక్రమార్కుల చేతికి చిక్కిందని ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు. యూజర్ల బ్యాంక్ ఖాతాలు, ఖాతా నెంబర్ల వంటి బ్యాంకింగ్ సమాచారం కూడా డార్క్ వెబ్సైట్లలో ప్రత్యక్షమైంది.
బైయూకాయిన్ ప్లాట్ఫాం ద్వారా యూజర్ల పాన్, పాస్పోర్ట్ నెంబర్ల వంటి కీలక కేవైసీ డేటా సైతం డార్క్ వెబ్సైట్లలో పొందుపరిచారని సెక్యూరిటీ రీసెర్చర్ పేర్కొన్నారు. అయితే తమ ఫ్లాట్ఫాంపై ఎలాంటి డేటా లీక్ కాలేదని బైయూకాయిన్ కంపెనీ వర్గాలు చెప్పుకొచ్చాయి. డార్క్ వెబ్ల్లో లీకైనట్టు చెబుతున్న డేటా కొన్ని డమ్మీ ఖాతాలకు సంబంధించినదని తెలిపాయి.
మరోవైపు డార్క్వెబ్లో క్రిప్టోకరెన్సీ యూజర్ల కీలక డేటా డంప్ అయినట్టు తాను ఇటీవల గుర్తించానని, మూడులక్షల మందికి పైగా బైయూకాయిన్ యూజర్ల కీలక సమాచారం ఈ సైట్లలో ప్రత్యక్షమైందని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు రాజశేఖర్ రజారియా చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్లో బైయూకాయిన్ డేటా గోప్యతను ఉల్లంఘించడం డార్క్ వెబ్లో సమాచారం లీక్ అయ్యేందుకు దారితీసిందని అన్నారు.
.
తాజావార్తలు
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు