టెహ్రాన్: క్రిప్టో కరెన్సీ మైనింగ్పై ఇరాన్ నిషేధం విధించింది. సెప్టెంబర్ 22 వరకు నిషేధం అమలులో ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు. పలు నగరాల్లో తరుచుగా బ్లాక్ ఔట్లు ఏర్పడటంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. బిట్ కాయిన్కు ఇది గణనీయ పరిణామం.
అంతర్జాతీయంగా బిట్ కాయిన్ మైనింగ్లో ఇరాన్ వాటా 4.5 శాతం అని బ్లాక్ చెయిన్ అనలిటిక్స్ ఎల్లిప్టిక్ తెలిపింది. క్రిప్టో మైనింగ్ ద్వారా అధిక రెవెన్యూ కోరుతున్నది ఇరాన్.
దేశంలో తరుచుగా విద్యుత్ కొరత, కోతలకు బిట్ కాయిన్ మైనర్లే కారణమని ఇరాన్ ఆరోపిస్తున్నది. ఈ ఏడాది జనవరిలో పలు అనియంత్రిత మైనింగ్ సంస్థలను మూసేసింది.
ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు విమర్శలొచ్చాయి. దేశంలో 85 శాతం క్రిప్టో కరెన్సీ మైనింగ్ చట్ట విరుద్ధం అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్వయంగా అంగీకరించారు. ప్రతి రోజూ లీగల్ మైనింగ్ 300 మెగావాట్ల విద్యుత్ను వాడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో సగానికి పైగా ప్రస్తుతం బిట్ కాయిన్ మైనింగ్ కోసం ఉపయోగిస్తున్నాయని కేంబ్రిడ్జి సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫైనాన్స్ (సీసీఏఎఫ్) తెలిపింది. అధిక మొత్తంలో విద్యుత్ వినియోగం పర్యావరణంపై ప్రభావం చూపుతున్నది.
సీసీఏఎఫ్ డేటా ప్రకారం 76 శాతం సంప్రదాయేతర ఇంధనంతో మైనర్లు బిట్ కాయిన్ను తయారు చేశారు. ఇరాన్లో 600 మెగావాట్ల విద్యుత్.. బిట్కాయిన్ల మైనింగ్కు ఉపయోగిస్తున్నారు. ఇది ఏటా 100 కోట్ల డాలర్ల ఆదాయం కల్పిస్తుంది.
నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?
ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం పదిలం
వ్యాక్సినేషన్ తోనే ఎకానమీపై మహమ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ
వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!
హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు ప్రధాని పర్యటన
ఐటీ కొత్త రూల్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ సంస్థ
మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!
నన్నెవరూ అరెస్ట్ చేయలేరు : రాందేవ్ బాబా
యాంటీబాడీ కాక్టెయిల్ ట్రయల్స్కు జైడస్ దరఖాస్తు
భారతీయ ఐటీ చట్టాలకు కట్టుబడి ఉన్నాం : గూగుల్ సీఈవో
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు