న్యూఢిల్లీ: తాజాగా కరోనా రెండో వేవ్ భయం వెంటాడుతున్నా, ముడి చమురు డిమాండ్ పెరిగిపోవడంతో దాని ధరలు పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్పై 1.01 డాలర్ పెరిగి 64.68 డాలర్లకు పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ప్యూచర్ ధర పెరిగి 88 సెంట్లు పెరిగి, బ్యారెల్పై ఒక డాలర్ పెరిగి 61.06 డాలర్లకు చేరింది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) స్పందిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ఆయిల్ డిమాండ్, సరఫరా రీ బ్యాలెన్స్ అవుతుందని అంచనా వేసింది. ప్రతి రోజూ అదనంగా రెండు మిలియన్ల బ్యారెళ్లకు డిమాండ్ పెరుగుతుందని తెలిపింది.
మంగళవారం సమావేశమైన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ప్లోరింగ్ కంట్రీస్ (ఒపెక్) కూడా 2021లో గ్లోబల్ డిమాండ్ 5.95 మిలియన్ల బీపీడీకి చేరుతుందని పేర్కొంది.
అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలు కోలుకున్న సంకేతాలు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్తంభించడం, బ్రెజిల్, భారత్లలో కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
కొవిడ్పై పోరు.. ఫ్రీగా ఆక్సిజన్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ
‘మోటో’లవర్స్ కి గుడ్ న్యూస్
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
మార్కెట్లోకి హైబ్రిడ్ ట్రాక్టర్
వాట్సాప్లో ఈ ట్రిక్స్ తెలుసా?
బైడెన్ ఎఫెక్ట్ : భారత టెక్, ఫార్మా కంపెనీలపై పన్ను భారం
ఫ్లిప్కార్ట్ చేతికి క్లియర్ ట్రిప్
ఆదాయంలో అంచనాలు దాటిన విప్రో
ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు