5 వేలతో కరోడ్పతి

పిల్లలు ఆర్థికంగా సురక్షితంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడు చాలా సులభం. మీరు చేయవలిసిందల్లా పిల్లల పేరిట నెలకు రూ.5,000 పెట్టుబడి పెట్టడమే. అదే వారినికోటీశ్వరులుగా మార్చుతుంది. ప్రారంభంలో రూ.5 వేల పెట్టుబడి మీకు కష్టమే కావచ్చు. కానీ ఈ రోజు నుంచే మీరు ఈ పెట్టుబడిని ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మొత్తం మీ ఆదాయంలో చాలా తక్కువ భాగమే అవుతుంది.
ఎక్కడ పెట్టుబడి పెట్టాలి..
కరోనాతో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే పెట్టుబడులు శ్రేయస్కరం. ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి సరైన ప్రణాళిక. ఒక పద్ధతి ప్రకారం సిప్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా చాలా లాభాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మీ మొత్తం పెట్టుబడి ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నెలకు రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 20 ఏండ్ల తర్వాత కోటి వరకు పెరుగుతుంది. 12 శాతం రాబడితో ఇంత ఆదా యం వస్తుంది. ప్రస్తుత మ్యూచువల్ ఫండ్లలో ఏది అధిక లాభం చేకూరుస్తున్నదో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి.
తాజావార్తలు
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు