న్యూఢిల్లీ: కరోనా వల్ల దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీసు లీజు డిమాండ్ తగ్గుముఖం పట్టినా, హైదరాబాద్, కోల్కతాల్లో మాత్రం డిమాండ్ ఊపందుకున్నది.
గతేడాది మార్చి నెలాఖరు నాటికి 0.9 మిలియన్ల చదరపు అడుగుల లీజుకు డిమాండ్ వస్తే, ఈ ఏడాది అది 1.1 మిలియన్ చదరపు అడుగులకు దూసుకెళ్లింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోనూ ఇదే ధోరణి నెలకొంది.
కమర్షియల్ రియల్ ఎస్టేట్ వాతావరణం క్రమంగా ఊపందుకుంటున్నట్లు కనిపించినా.. కరోనా రెండో వేవ్ పరిస్థితులను తలకిందులు చేసింది.
2020 మార్చి నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే 2021 చివరి త్రైమాసికంలో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల పరిధిలో ఆఫీసు స్పేస్ లీజింగ్కు డిమాండ్ తగ్గుముఖం పట్టింది.
గత జనవరి-మార్చి మధ్య దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో నికరంగా ఆఫీసు స్పేస్ లీజు డిమాండ్ 36 శాతం తగ్గిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ వ్యాఖ్యానించింది. ఏ కార్పొరేట్ సంస్థ కూడా అద్దెలు భరించడానికి సిద్ధంగా లేవు.
2020 మార్చి త్రైమాసికంలో 8.6 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ లీజుకు డిమాండ్ రాగా, గత జనవరి-మార్చి మధ్య అది 5.53 మిలియన్ల చదరపు అడుగులకు పడిపోయింది.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 2.1 మిలియన్ల చదరపు అడుగుల నుంచి 0.2 మిలియన్ల చదరపు అడుగులకు పరిమితమైంది.
మరో కార్పొరేట్ ఇండియా హబ్గా నిలిచిన బెంగళూరులో గతేడాది 2.7 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం ఆఫీస్ స్పేస్ లీజు కోసం డిమాండ్ రాగా, అది ఈ ఏడాది 2.2 మిలియన్ల చదరపు అడుగులకు కుదించుకుపోయింది.
చెన్నైలో 0.9 మిలియన్ల చదరపు అడుగుల నుంచి 0.4 మిలియన్ల చదరపు అడుగులకు, ఢిల్లీ-ఎన్సీఆర్లో 1.5 మిలియన్ల నుంచి 1.1 మిలియన్ల చదరపు అడుగులకు తగ్గింది.
ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అంచనా మాత్రం ఆఫీసు స్పేస్ లీజు కోసం డిమాండ్ తగ్గిపోవడం తాత్కాలికమేనని చెబుతున్నది. ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోం కొనసాగుతుండటంతో సంస్థలు కొత్తగా కార్యాలయాల నిర్వహణకు ఆఫీసు స్పేస్ లీజు తీసుకునేందుకు వెనుకాడుతున్నాయి.
కానీ పరిస్థితులు మారిపోతాయని అనరాక్ రీసెర్చ్ డైరెక్టర్ అండ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో సుమారు 42 వేల మందిని నియమించుకోనున్నాయి.
మల్టీ నేషనల్ మేజర్లు కాగ్నిజెంట్, కాప్ జెమినీ తదితర సంస్థలు 2020లో సుమారు 40 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. 2021లో భారీగా నియామక ప్రణాళికలు ఉన్నాయి. దాదాపు 30 వేల మందిని నియమించుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
పలు ఐటీ సంస్థలు ఓవరాల్ బిజినెస్ను వేగవంతం చేయడానికి భారీగా నియామకాలకు ఆసక్తిగా ఉన్నాయి. 2022, 2023ల్లో ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ పెరుగుతుందని ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు.
అయితే, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఉబెర్ మాత్రం మే తర్వాత భారీ స్థాయిలో వలసలు మొదలవుతాయని అంచనా వేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటి వరకు అమలులో ఉన్న వర్క్ ఫ్రం హోం విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
కొవిడ్పై పోరు.. ఫ్రీగా ఆక్సిజన్ పంపిస్తున్న ముకేశ్ అంబానీ
‘మోటో’లవర్స్ కి గుడ్ న్యూస్
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
మార్కెట్లోకి హైబ్రిడ్ ట్రాక్టర్
వాట్సాప్లో ఈ ట్రిక్స్ తెలుసా?
బైడెన్ ఎఫెక్ట్ : భారత టెక్, ఫార్మా కంపెనీలపై పన్ను భారం
ఫ్లిప్కార్ట్ చేతికి క్లియర్ ట్రిప్
ఆదాయంలో అంచనాలు దాటిన విప్రో
ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు
రుణ వసూళ్లపై మారటోరియం.. మోదీకి ఉద్ధవ్ విజ్ఞప్తి