ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అఫీషియల్ పార్ట్నర్గా అప్స్టాక్స్ ఉంటుందని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న డిజిటల్ బ్రోకరేజ్ సంస్థ అప్స్టాక్స్ ఏప్రిల్ 9 నుంచి ఆరంభంకానున్న ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ పేర్కొంది. ఈ ఒప్పందం రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని వెల్లడించింది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, ఈటీఎఫ్లు ఆన్లైన్ ఫైనాన్షియల్ సేవలందించడమే లక్ష్యంగా అప్స్టాక్స్ను స్థాపించారు. ప్రస్తుతం అప్స్టాక్స్కు 2.8 మిలియన్ల వినియోగదారులున్నారు.
‘ఐపీఎల్ 2021లో బీసీసీఐతో ఒప్పందం చాలా థ్రిల్లింగ్గా ఉంది. భారత్లో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువే. భారతీయుల సంస్కృతి, సామాజిక జీవనంలో ఒక భాగం. ముఖ్యంగా మిలీనియల్స్లో క్రికెట్కు విశేషాదరణ ఉందని’ అప్స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు.