ప్రభుత్వ నిధులున్నా.. అభివృద్ధికి అడ్డంకులు
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
నిర్లక్ష్యం ఎవరిది.. బాధ్యులెవరు..?
అసంపూర్తిగా వైకుంఠధామం
జడ్చర్ల టౌన్, మార్చి 21 : గ్రామాల్లో అన్ని మౌలిక వసతులను కల్పించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిం ది. కానీ ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వ య లోపంతో పనులు ముందుకు సాగడం లేదు. జడ్చర్ల మండలం ఆలూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆలూర్, కొత్తతండా, యాసాయికుంట తం డాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో పల్లెప్రగతి లక్ష్యం నెరవేరడం లేదు. ఓ వైపు పంచాయతీ పాలకవ ర్గం, మరోవైపు అధికారులు ‘ఎవరికి వారే.. య మునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
ఆలూర్ గ్రామంలో వైకుంఠధామం నిర్మాణానికి సరిపడా ప్రభుత్వ భూమి లేదు. దీంతో పక్కనే ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూమి కొనుగోలుపై అధికారులు, పంచాయతీ పాలకవర్గం నిర్ణయాని కి రాకపోవడంతో వైకుంఠధామం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు కేటాయించిన స్థలం వివాదాస్పదంగా ఉం డడంతో పనులు ముందుకు వెళ్లడం లేదు.
జడ్చర్ల నుంచి ఆలూర్కు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది
డ్రైనేజీ, అంతర్గత రహదారుల పరిస్థితి అ ధ్వాన్నంగా తయారైంది.
గ్రామంలో రైతువేదిక, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు.
ఆలూర్ గ్రామ పరిధిలోని యాసాయికుం ట తండాలో మొత్తం 40 ఇండ్లు ఉన్నాయి. 200 కు పైగా జనాభా ఉన్న తండా నుంచి ఎన్నికైన వార్డుసభ్యుడు మూడురోజులకే మృతి చెందాడు. నేటికీ వార్డుసభ్యుడి ఎన్నిక జరగలేదు. తండాలో డ్రైనేజీ, విద్యుద్దీపాలు, నీళ్ల ట్యాంకు లీకేజీ సమస్య ఉన్నది.
రేషన్ సరుకుల కోసం తండావాసులు దా దాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూర్ గ్రా మానికి రావాలి. తండాకు దగ్గరగా ఒక కి.మీ. దూరంలో ఉన్న బూరెడ్డిపల్లి రేషన్షాపునకు మా రిస్తే తండావాసులకు సౌకర్యకరంగా ఉంటుంది.
ఆరేండ్ల కిందట మూతబడిన ప్రాథమిక పాఠశాల పశువులు, మేకలకు నిలయమైంది.
బాదేపల్లి నుంచి తండాకు ఎస్టీఎస్డీఎ ఫ్ ద్వారా రూ.1.50 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్డు పనుల్లో కొందరు రై తులు అభ్యంతరాలు తెలపడంతో కాంట్రాక్టర్ కేవలం నాలుగు కల్వర్టులు పూర్తి చేసి రోడ్డు పనులను అసంపూర్తిగా వదిలిపెట్టారు.
అధికారుల వివరణలు..
మూతబడిన పాఠశాలపై ఎంఈవో మంజులాదేవిని వివరణ కోరగా.. యాసాయికుంట తండాలో పిల్లలు బడిలో చేరేందుకు సిద్ధంగా ఉం టే పాఠశాలను పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే తండాకు వెళ్లి పాఠశాలను పరిశీలిస్తానని చెప్పారు.
పల్లెప్రగతి పనులపై పంచాయతీ కార్యద ర్శి రమేశ్ను వివరణ కోరగా.. ‘గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు నాటాం. సెగ్రిగేషన్ షెడ్డు, రైతు వేదిక పూర్తయింది. పల్లెప్రకృతి వనం ఏర్పాటుకుగానూ స్థలం విషయంలో కొందరు అడ్డుతగులుతున్నారు. తాసిల్దార్ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశా. భూ సమస్యతో వైకుంఠధామం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. యా సాయికుంట తండాలో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం. వారానికోసారి తండా లో మురుగుకాలువలను శుభ్రం చేస్తున్నాం. వి ద్యుత్ బల్బులు ఏర్పాటు చేశాం.’ అని చెప్పారు.
పల్లెప్రకృతి వనం ఏర్పాటుపై తాసిల్దార్ లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. ‘పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని కేటాయించ గా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. వెంటనే సంబంధిత భూమికి సర్వేయర్తో, ఏడీతో సర్వే చేయించి గ్రామకార్యదర్శికి అప్పగించాం. కానీ మేము చూయించిన భూమికి బదులుగా మరోచోట పంచాయతీ పాలకవర్గం పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేస్తామంటున్నారు.
గ్రామ శివారులో దాదాపు 13 గుంటల ప్ర భుత్వ భూమిలో నిర్మాణమైన వైకుంఠధామం పక్కనే ఉన్న పట్టాభూమిని కొనేందుకు పట్టాదారులతో మాట్లాతున్నాం. పల్లె ప్రగతి పనులకు అధికారులు సహకరించటంలేదనేది సరికాదు. యాసాయికుంట తండావాసుల రేషన్షాపు సమస్యను పరిష్కరిస్తాం.’ అని తెలిపారు.