2021 మొదలైన తర్వాత కరోనాను తట్టుకుని అన్ని ఇండస్ట్రీల కంటే కూడా తెలుగులో మంచి సినిమాలు వచ్చాయి. విజయాలు కూడా వచ్చాయి. సంక్రాంతికి క్రాక్, రెడ్ సినిమాలు సత్తా చూపిస్తే.. ఫిబ్రవరిలో ఉప్పెన, నాంది కంటిన్యూ చేశాయి. మార్చిలో జాతి రత్నాలు చేసిన రచ్చ గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఏప్రిల్లో మాత్రం పరిస్థితి మారింది. ఈ నెలలో రిలీజైన సినిమాల్లో వకీల్ సాబ్ మినహా దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్లే అని చెప్పుకోవాలి.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నెలలో దారుణమైన నష్టాలను చూసింది టాలీవుడ్. ముఖ్యంగా ఈ నెలలో విడుదలైన చాలా సినిమాలు నిరాశ పరిచాయి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 2న విడుదలైన కార్తి సుల్తాన్, నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత వారంలో వచ్చిన వకీల్ సాబ్ మాత్రమే ఈ నెల పరువు కాపాడింది. అది కూడా మొదటి వారంలోనే కలెక్షన్స్ బాగా వచ్చాయి. వకీల్ సాబ్ సోలోగా నిలబడి రూ.85 కోట్లు వసూలు చేశాడు. వకీల్ సాబ్ తర్వాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. కరోనా కారణంగా థియేటర్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శుక్ర, ఆర్జీవీ దెయ్యం, టెంప్ట్ రాజా, కథానిక, ఒక అమ్మాయి క్రైం స్టోరీ లాంటి సినిమాలు కనీసం విడుదలైనట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. నిజానికి తొలి మూడు నెలల జోరు చూసి ఏప్రిల్ చాలా బాగుంటుందనుకున్నారంతా. ఎందుకంటే లవ్ స్టోరీ, టక్ జగదీష్ సినిమాలు కూడా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా అన్నీ వాయిదా పడ్డాయి. దాంతో చివరికి ఏప్రిల్ డిజాస్టర్ మంత్ గానే మిగిలిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రానా మరో పాన్ ఇండియా ప్రాజెక్టు..అఫీషియల్!
జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న యంగ్ హీరో..!
తమిళ ఇండస్ట్రీకి కలిసి రాని 2021.. వరుస మరణాలతో షాక్లో ఫ్యాన్స్!
నిధి అగర్వాల్ సోయగం చూడతరమా..!