న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ చెయిన్ కేఫ్ కాఫీ డే ప్రస్తుతం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను సీడీఈఎల్కు చెల్లించాల్సిన రూ.280 కోట్ల బకాయిలను తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) దివాలా పిటిషన్ను దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ బకాయిలను తిరిగి చెల్లించడానికి పలు ఆస్తులను అమ్మకానికి పెట్టినప్పటికీ కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో సంస్థకు ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.