ముంబై, ఆగస్టు 20: తొలి పబ్లిక్ ఆఫర్లను (ఐపీవోలు) జారీచేయడానికి పలు కంపెనీలు కదంతొక్కుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో తొలి 20 రోజుల్లోనే 23 కంపెనీలు ఐపీవోల జారీకి అనుమతి కోరుతూ మార్కెట్ రెగ్యులేటర్ సెబికి ముసాయిదా ప్రాసెక్టస్లు ఫైల్ చేశాయి. ఈ 23 కంపెనీలు రూ.40,000 కోట్ల సమీకరణకు సిద్ధమవుతుండగా, ఈ నెలలో ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోలు జారీచేసి రూ. 18,200 కోట్లకుపైగా సమీకరించాయి. తాజాగా ప్రాస్పెక్టస్లను సమర్పించిన కంపెనీల్లో చాలావరకూ ఫిన్టెక్, ఈ-కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాల్లోని స్టార్టప్లే. వీటిలో పాలసీబజార్ రూ.6,000 కోట్ల ఐపీవోకు,ఎంక్యూర్ ఫార్మా రూ.5,000 కోట్ల సేకరణకు,అదాని గ్రూప్నకు చెందిన అదాని విల్మార్ రూ.4,500 కోట్ల ఐపీవోకుసంకల్పించాయి. ముంబైకి చెందిన అప్పెరల్ బ్రాండ్ న్యాకా రూ.4,000 కోట్ల ఐపీవోకు దరఖాస్తుచేసింది. ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ సంస్థ లెక్సిగో ప్రమోటర్ లె ట్రావెన్యూస్ టెక్నాలజీ రూ.1,800 కోట్ల ఐపీవోకు రానుంది.