న్యూఢిల్లీ: దేశంలోని రెండు ప్రధాన టెల్కో సంస్థల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు నూతన సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడంలో పోటీ పడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఏకగ్రీవ టారిఫ్ పెంపు ప్రక్రియ చూడటం కష్టమేనని తెలుస్తున్నది. డొమెస్టిక్ క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిసిల్ రీసెర్చ్ వింగ్ ఈ అధ్యయనాన్ని రుజువు చేసింది.
నూతన సబ్స్క్రైబర్లలో జియో షేర్ 33.7 శాతం కాగా, భారతీయ ఎయిర్టెల్ వాటా 33.6 శాతంగా ఉందని క్రిసిల్ రీసెర్చ్ గుర్తు చేస్తున్నది. రెండు అగ్రశ్రేణి టెల్కోల యాక్టివ్ సబ్స్క్రైబర్ మార్కెట్ ప్రకారం ముఖాముఖీ పోరు సాగుతున్నది. కనుక ఏ సంస్థ కూడా టారిఫ్ పెంపునకు గానీ, ఇతర చర్యలు ప్రకటించేందుకు గానీ ముందుకు రావడ్లేదు.
టెలికం పరిశ్రమలో కాంపిటీటివ్ ఇంటెన్సిటీ బిల్డప్ చేయడంలో భాగంగా సమీప భవిష్యత్లో రెండు ప్రధాన సంస్థలు టారిఫ్ రేట్లు పెంచడానికి మందుకు రాకపోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (అర్పు) చాలా పరిమితం అని క్రిసిల్ పేర్కొనడం గమనార్హం.
25-35 కోట్ల మంది యాక్టివ్ నాన్-4జీ సబ్స్క్రైబర్ల బేస్లోని యూజర్లను 4జీ యూజర్లుగా మార్చివేసేందుకు టెల్కోలు చేసే ప్రయత్నమే వారి ఆదాయాల పెంపునకు దారి తీస్తుంది. పోటీ తత్వంతో యూజర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి టెల్కోలు.
గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ స్థాయిలో సబ్స్క్రైబర్ల పునాది పెరిగినా టెల్కోలు హ్యాండిల్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. తద్వారా మార్కెట్ షేర్ పెంచుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. 2019కి ముందు టెల్కోలు సబ్స్క్రైబర్లపై టారిఫ్ చార్జీలు పెంచడం చూసేవారం. తర్వాత పరిస్థితి మారిపోయింది.
చౌక ధరకే స్మార్ట్ ఫోన్ల విక్రయానికి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలతో టై అప్ చేసుకోవడంతోపాటు ఓవర్ ది టాప్ (ఓటీటీ) కంటెంట్ పెంచడం, కస్టమర్ల లోయర్ ఎంట్రీ పాయింట్లు అప్గ్రేడ్ కీలకం కానున్నాయి.
ఇటీవలే 4జీ సంచలనం రిలయన్స్ జియో.. 2021 సంవత్సరానికి గాను తన ఖాతాదారులకు ఏడాది లేదా రెండేండ్ల అపరిమిత కాలింగ్ వ్యాలిడిటీ (రూ.1,499/ రూ.1,999)ని అందుబాటులోకి తెచ్చింది. ఇది జియో సబ్స్క్రైబర్లను పెంచడానికి ఉపకరిస్తుండవచ్చు.
టారిఫ్ రేట్ల పెంపుపై అంగీకారానికి వచ్చిన టెల్కోలు.. తమ సిబ్బంది వేతనాల పెంపునకు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉంటే, ప్రధాన నగరాల పరిధిలో కరోనా ఆంక్షలు అమలులోకి రావడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్పై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో 2021-22 తొలి త్రైమాసికంలో 4జీ సబ్స్క్రైబర్లు అదనంగా చేరే ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని క్రిసిల్ వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే 2021-22లో 4జీ సబ్స్క్రైబర్ల బేస్ 720 మిలియన్ల నుంచి 820 మిలియన్లకు చేరొచ్చునని క్రిసిల్ అంచనా. అయితే, రాష్ట్రాల వారీగా విధిస్తున్న లాక్డౌన్లు పొడిగిస్తే 810 మిలియన్లకే సబ్స్క్రైబర్ల పెరుగుదల పరిమితం కావొచ్చు.
పీపీఈ కిట్లో పెళ్లి.. వైరల్ వీడియో
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
తరుణ్ తేజ్పాల్పై అత్యాచార ఆరోపణల కేసు.. విచారణ మే 12కు వాయిదా
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
సరికొత్త హయబూసా.. ధర 16.4 లక్షలు
కేజీ-డీ6 శాటిలైట్ క్లస్టర్లో ఉత్పత్తి
ఎస్బీఐలో 5 వేల క్లర్క్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం
ఢిల్లీ ఎయిమ్స్కు చోటా రాజన్ తరలింపు
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
మహారాజా కోసం స్పైస్ జెట్ కూడా.. ఫైనాన్సియల్ బిడ్ గడువు పొడిగించాలంటూ..!
టెకీలకు ఊరట : ఉద్యోగులకు అదనంగా వేతనంతో కూడిన సెలవలు