న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లాలో సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ రానున్నది. ఇందుకు సంబంధించిన రిటైల్ లైసెన్స్ల కోసం ఆసక్తి ఉన్నవారు బిడ్లను దాఖలు చేసుకోవచ్చని పెట్రోలియం, సహజ వాయువు రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ) శుక్రవారం ఆహ్వానించింది. ఆఖరు తేదీ డిసెంబర్ 15. కాగా, 11వ సిటీ గ్యాస్ లైసెన్సింగ్ రౌండ్లో భాగంగా దేశవ్యాప్తంగా 65 భౌగోళిక ప్రాంతాల్లో సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి పీఎన్జీఆర్బీ సిద్ధమైంది. ఇందులో తెలంగాణ నుంచి నిజామాబాద్ కూడా ఉన్నది. ఏపీలో కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అవకాశం లభించింది. 2018, 2019లో ఆటోమొబైల్స్కు రిటైల్ సీఎన్జీ, ఇండ్లకు పైపులద్వారా వంటగ్యాస్ పంపిణీకిగాను 136 భౌగోళిక ప్రాంతాల్లో పీఎన్జీఆర్బీ లైసెన్సులను జారీ చేసిన విషయం తెలిసినదే.