ముంబై, ఏప్రిల్ 15: అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ సిటీబ్యాంక్.. భార త వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో కన్జ్యూమర్ బ్యాంకింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటనకు అనుగుణంగా దేశీయ కన్జ్యూమర్ బ్యాంకింగ్ వ్యాపారానికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత్లో క్రెడిట్ కార్డు, రిటైల్ బ్యాంకింగ్, గృహ రుణాలు, వెల్త్మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నది. దేశీయంగా 35 శాఖలు కలిగిన బ్యాంక్లో 4 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వీరు త్వరలో రోడ్డున పడే ప్రమాదం ఉన్నది.