న్యూఢిల్లీ, జూన్ 29: కొవిడ్ డ్రగ్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐదు భారత ఫార్మా దిగ్గజాలు చేతులు కలిపాయి. స్వల్ప కరోనా లక్షణాలున్నవారి చికిత్సకు ఉపయోగించే ఓరల్డ్రగ్ మొల్నుపిరావిర్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఎమ్క్యూర్, సన్ఫార్మా, టొరెంట్ ఒక సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్-19 అవుట్పేషెంట్ సెట్టింగ్ ఏర్పాటుద్వారా ఈ డ్రగ్ ప్రభావంపై జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో ట్రయల్స్ నిర్వహిస్తామని, ఇందు కు 1200 మంది పేషెంట్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆయా కంపెనీలు స్టాక్ ఎక్ఛేంజీలకు తెలిపాయి. డాక్టర్ రెడ్డీస్ తాను ఉత్పత్తిచేసిన మొల్నుపిరావిర్ను ఉపయోగించి క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించనుండగా,మిగిలిన ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తికి సమానమైన ఔషధాల ద్వారా ట్రయిల్స్ చేపడతాయి.