హైదరాబాద్ శంషాబాద్, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోమారు పలు అవార్డులను దక్కించుకున్నది. సీఐఐ, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 22వ జాతీయ అవార్డుల్లో జీఎమ్మార్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ యూనిట్ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా ఇంధన సామర్ధ్యాలను సమర్థంగా వినియోగించుకోవడం, ఇంధన పొదుపు, ప్రయాణీకులకు సంతృప్తికర సేవలు అందించడం వల్లనే ఈ అవార్డులు వరించాయన్నారు.