చైనా పెట్టుబడులకు మళ్లీ ఓకే

9 నెలల తర్వాత మనసు మార్చుకున్న కేంద్రం
45 ఎఫ్డీఐ ప్రతిపాదనలకు అనుమతిచ్చేందుకు సిద్ధం
ఒక్కో ప్రతిపాదనకు విడివిడిగా అనుమతులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: చైనా నుంచి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్లో మళ్లీ ద్వారాలు తెరుచుకొంటున్నాయి. చైనా ఎఫ్డీఐ ప్రతిపాదనలకు దాదాపు తొమ్మిది నెలల నుంచి అనుమతులను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కో ప్రతిపాదనకు కేస్-బై-కేస్ పద్ధతిలో (విడివిడిగా) అనుమతులివ్వడం మొదలుపెట్టింది. వివాదాస్పద సరిహద్దు వద్ద ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు తగ్గడంతో చైనాకు చెందిన 45 పెట్టుబడి ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటిలో గ్రేట్ వాల్ మోటర్, ఎస్ఏఐసీ మోటర్ కార్పొరేషన్ లాంటి కంపెనీల ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి గత కొన్ని వారాల నుంచే ఈ అనుమతులు ప్రారంభమయ్యాయని, ఇప్పటివరకు చిన్న పెట్టుబడులకే ఈ అనుమతులు పరిమితమయ్యాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత పెద్ద ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఓ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని, నీతి ఆయోగ్తోపాటు కేంద్ర హోమ్, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైందని ఆ వర్గాలు వివరించాయి. ఇది అన్ని రకాల ఎఫ్డీఐ ప్రతిపాదనలను పరిశీలించే విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు లాంటిది కాదని ఓ అధికారి తెలిపారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి వచ్చే అన్ని ఎఫ్డీఐ ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలే స్వయంగా పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.
తాజావార్తలు
- అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు