బీజింగ్: ఇటీవలి వరకు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా సంచలనాలు నెలకొల్పిన చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా అధినేత జాక్మాను ఇప్పట్లో కష్టాలు వదిలేలా కనిపించడం లేదు. అలీబాబా గ్రూప్-మిన్మెటల్స్ డెవలప్మెంట్ మధ్య జాయింట్ వెంచ్పై చైనా మార్కెట్ నియంత్రణ సంస్థ దర్యాప్తు చేపట్టింది. దేశంలోని ఇంటర్నెట్ సంస్థలపై చైనా సర్కార్ కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే.
2015 అలీబాబా-మిన్మెటల్స్ మధ్య జాయింట్ వెంచర్ కుదిరింది. అటుపై అలీబాటా గుర్తు తెలియని సంస్థకు 2019లో 44 శాతం వాటాలను ట్రాన్స్ఫర్ చేసింది. దీనిపై ఇటీవలే తాము చైనా మార్కెట్ నియంత్రణ సంస్థ నుంచి నోటీసు అందుకున్నామని మిన్మెటల్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
మిన్మెటల్స్కు మార్కెట్ నియంత్రణ సంస్థ జారీ చేసిన నోటీసుపై స్పందించడానికి అలీబాబా నిరాకరించింది. ఈ నెల ప్రారంభంలోనే అలీబాబా గ్రూప్పై చైనా మార్కెట్ల నియంత్రణ సంస్థ 2.75 బిలియన్ల డాలర్ల ఫైన్ విధించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు తీసుకోవాలి..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ