బీజింగ్: ఇటీవలి కాలంలో దేశంలోని బడా టెక్నికల్ కంపెనీలపై డ్రాగన్ కొరడా ఝుళిపిస్తున్నది. సైబర్ సెక్యూరిటీ, దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందంటూ తాజాగా 25 యాప్లను తొలగించి వేయాలని దేశంలోని యాప్ స్టోర్లను చైనా సర్కార్ ఆదేశించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ సారధ్యంలోని సర్కార్ ఆదేశాల మేరకు క్యాబ్ అగ్రిగేటర్ సర్వీసెస్ సంస్థ .. ‘దీదీ గ్లోబల్’ యాప్ను తొలగించిన సంగతి విదితమే. తెలిసిందే.
అదే దీదీ గ్లోబల్కు చెందిన మరో 25 యాప్లనూ తొలగించి వేయాలని చైనా సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. కొత్త సైబర్ నిబంధనల అమలు పేరుతో విదేశాలకు తరలించే సమాచారంపై ప్రభుత్వ నియంత్రణ మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైంది.
దేశ భద్రత పేరిట టెన్సెంట్, అలీబాబా కంపెనీలపై గతంలో చైనా సర్కార్ విరుచుకు పడింది. తాజాగా సైబర్ సెక్యూరిటీ కాపాడాలనే సాకుతో దేశీయ టెక్నాలజీ సంస్థలపై ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇదిలా ఉంటే విదేశాల స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీలపై నిఘా కొనసాగుతుందని గత వారం చైనా పేర్కొంది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు పేరిట చైనీయుల కీలక సమాచారాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చైనా సర్కార్ అభియోగం.
సైబర్ సెక్యూరిటీ రివ్యూ నేపథ్యంలో నూతన రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ దీదీ గ్లోబల్ యాప్కు తెలిపింది. జూన్ 30న న్యూయార్క్లో ఐపీఓకు వెళ్లిన దీదీ గ్లోబల్ దాదాపు 4.4 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఇంతలోనే చైనా ఆంక్షలు మొదలవ్వడంతో దీదీ షేర్లు కుప్పకూలాయి.
ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా సారధ్యంలోని యాంట్ గ్రూప్ అమెరికాలో ఐపీఓకు వెళ్లకుండా నియంత్రించడంతో టెక్ సంస్థలపై చైనా కార్పొరేట్ నియంత్రణ చర్యలు గతేడాది నవంబర్లో మొదలయ్యాయి. దీనివల్ల చైనా టెక్ సంస్థలు అభద్రతా భావంలో చిక్కుకున్నాయి.
దేశ భద్రతకు సవాల్ విసరడంతో గతేడాది టిక్టాక్తోసహా పలు చైనా యాప్లను భారత్ నిషేధించింది. కానీ భారత్ చర్యపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం సొంత దేశీయ యాప్లనే చైనా నిషేధిస్తున్నదని నిపుణులు విమర్శిస్తున్నారు.
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
పులిని వెంబడించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
6 ఏళ్ల బాహుబలి… ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
కప్పా వేరియంట్ గురించి ఏమీ చెప్పలేం : వైద్య నిపుణులు
రూ.10 లక్షల లోపు బెస్ట్ డీజిల్ కార్లు ..
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
భారత్ ఫారెక్స్ నిల్వలు.. ఎంత పెరిగాయంటే..!!
Crypto Investersకు షాక్.. విదేశాలకు నిధుల మళ్లింపుకు ఐసీఐసీఐ నో!