రంగారెడ్డి, మార్చి 12, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆ యా పార్టీలు తెరదించాయి. దాదా పు పదిహేను రోజులపాటు ఆయా పార్టీలతోపా టు స్వతంత్ర అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. ప్రచారంలో టీఆర్ఎస్ ముందు వరుసలో ఉన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పక్కా వ్యూహంతో ప్రచారంలో ముందుకెళ్లారు. ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో సమావేశమై లోపాలు సరి చేసుకుంటూ ప్రచారం చేశారు. జిల్లా మంత్రి పి.సబితారెడ్డితోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ప్రకాశ్గౌడ్ తదితరులు వారి నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ, న్యాయవాద సంఘాలు మిగతా పట్టభద్రులతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరారు. ఉద్యోగులను, ఉపాధ్యాయ సంఘాలు, బార్ అసోసియేషన్లతో మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ నియమించిన ఇన్చార్జీలు నిత్యం పట్టభద్రులను కలిసి ఓటును అభ్యర్థించారు. ఇన్చార్జిలతో నియోజకవర్గాల వారీగా మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి రెండు రోజులకోసారి సమావేశమై పట్టభద్రుల నుంచి వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్నా రు. రేపు పోలింగ్ జరుగనుండడంతో అధికారులు ఏర్పట్లలో నిమగ్నమయ్యారు.