బీజింగ్: యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి ముట్టడిలో విలవిలలాడుతుంటే, అమెరికా, చైనా మధ్య మరోమారు వాణిజ్య యుద్ధం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ఆ దేశానికి చెందిన 28 కంపెనీలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా పశ్చిమ దేశాల నుంచి హెచ్ అండ్ ఎం, నైకే, జారా తదితర దిగుమతి చేసుకుంటున్న బ్రాండ్ల వస్తువుల్లో నాణ్యత లోపించిందని చైనా ప్రభుత్వం ఆరోపించింది. పిల్లల దుస్తులు, ఇతర వస్తువుల నాణ్యత పూర్గా ఉందని పేర్కొంది.
ఈ వారంలో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ డే నేపథ్యంలో టీ-షర్టులు, బొమ్మలు (టాయ్లు), టూత్బ్రష్లతో పాటు 16 కంపెనీల ఉత్పత్తులు సురక్షితం కాదని, అన్ క్వాలిఫైడ్ ఉత్పత్తులని తెలిపింది.
జిన్జియాంగ్ నుంచి వచ్చే కాటన్ను వాడబోమని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన హెచ్ అండ్ ఎం బ్రాండ్ను బహిష్కరిస్తున్నట్లు చైనా అధికార టీవీ చానెల్ ప్రకటించింది. హెచ్ అండ్ ఎం గూడ్స్ను చైనాకు చెందిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి, యాప్ స్టోర్స్ నుంచి విత్ డ్రా చేశారు.
ఇంకా నైకే, అదిదాస్ వంటి కంపెనీల ఉత్పత్తులను కూడా తొలగించేశారు. చైనా సెలబ్రిటీలు ఆయా వెస్ట్రన్ బ్రాండ్లతో చేసుకున్న అవగాహనా ఒప్పందాల నుంచి పక్కకు తప్పుకున్నారు.
జిన్జియాంగ్ రాష్ట్రంలోని మైనారిటీ ముస్లిం గ్రూపులను డిటెన్షన్ క్యాంపులకు పరిమితం చేస్తున్నారని పశ్చిమ దేశాలు విమర్శిస్తున్నాయి. కానీ ఈ ఆరోపణలను చైనా అధికారులు వ్యతిరేకించారు. తమ పౌరులకు ఉద్యోగాల కల్పనకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.
తమ ఉత్పత్తులు సురక్షితం కాదని చైనా చేసిన ప్రకటనపై స్పందించడానికి నైకె, జారా, హెచ్ అండ్ ఎం సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి.
ఇలాగైతే 2025 నాటికే అందరికీ వ్యాక్సిన్ : శివసేన
కేఎస్ఆర్టీసీ ఇక కేరళదే.. కర్ణాటకకు షాక్
కశ్మీర్ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..
ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు
జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు
ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: ప్రభుత్వ అధ్యయనం
అత్యంత అందవిహీనమైన భాష కన్నడ అన్న గూగుల్.. క్షమాపణ చెప్పిన సంస్థ
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడకానికి దరఖాస్తు
పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..
ఈటల రాజేందర్ను ఎవరూ కాపాడలేరు : ప్రభుత్వ విప్ గువ్వల
రూ.43000 కోట్లతో ఆరు సబ్మెరైన్ల నిర్మాణానికి ఆమోదం
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం