ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్షలు
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి ఆదివారం బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్కు ప్రతీకగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ప్రార్థించారు.