న్యూఢిల్లీ, జూన్ 23: గ్లోబల్ ఔట్సోర్సింగ్ హబ్గా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేలా వాయిస్ ఆధారిత బీపీవోల కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దేశీయ, అంతర్జాతీయ యూనిట్ల మధ్య వ్యత్యాసాన్ని తొలగించింది. అన్ని రకాల ఓఎస్పీ సెంటర్ల మధ్య ఇంటర్కనెక్టివిటీకి అనుమతించింది. నిరుడు నవంబర్లోనే ఓఎస్పీ మార్గదర్శకాలను సడలించామని, ఇప్పుడు మరోసారి సరళతరం చేశామని, ఇది బీపీవో పరిశ్రమకు కొత్త ఉత్సాహమేనని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటు నిబంధనల సరళతరాన్ని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కాం స్వాగతించింది. ఐటీ-బీపీఎం రంగాల అభివృద్ధికి దోహదపడగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.