న్యూఢిల్లీ, జూన్ 30: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ 66 కోట్లకుపైగా జీఎస్టీ ఫైల్ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2017 జూలై1న జీఎస్టీ నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా ఆర్థిక శాఖ బుధవారం వరుస ట్వీట్లు చేస్తూ పన్ను చెల్లింపుదారులు, వినియోగదారులకు జీఎస్టీ స్నేహపూరితంగా వుంద న్న భావన అందరిలో వుందని పేర్కొంది. ‘నాలుగేండ్ల జీఎస్టీ అనే హ్యాష్ట్యాగ్తో మంత్రిత్వ శాఖ ట్వీట్ చేస్తూ జీఎస్టీతో ప్రజలు చెల్లించే పన్ను రేటు 13.5 శాతం నుంచి 11.6 శాతానికి తగ్గిందని తెలిపింది. ఏ రాష్ట్రంలోనైనా ఒక కంపెనీ వ్యాపారం చేయాల్సివస్తే 495 రకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేదని, ఇప్పు డా సంఖ్య 12కు దిగివచ్చిందని శాఖ పేర్కొంది. జీఎస్టీతో దేశాన్నంతటినీ ఒకే మార్కెట్గా మలచడం సాధ్యపడిందని తెలిపింది. ఎక్సైజు సుంకం, వ్యాట్ తదితర 17 రకాల పన్నులు, మరో 13 రకాల సెస్సుల్ని ఏకం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా జీఎస్టీప్రారంభమయ్యిం ది. ఇప్పటివరకూ జీఎస్టీ 1.3 కోట్ల పన్ను చెల్లింపుదారులు నమోదైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.