Additional DA for Central Employes | కేంద్ర ప్రభుత్వోద్యోగులకు నరేంద్రమోదీ సర్కార్ తీపి కబురందించింది. పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోమారు డేర్నెస్ అలవెన్స్ (డీఏ), డేర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంచనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన కరువు భత్యం (డీఏ) అమలులోకి వచ్చింది. ఇంతకుముందు 17% డీఏ చెల్లిస్తే, ఇప్పుడది 28 శాతానికి చేరుకున్నది. కనీస వేతనంలో 28 % డీఏ జూలై వేతనం నుంచి చెల్లిస్తున్నారు. హెచ్ఆర్ఏ కూడా 24 నుంచి 27 శాతానికి పెంచారు.
తాజాగా పండుగల సీజన్ వస్తున్నందున మరో మూడు శాతం డీఏ, మూడు శాతం డీఆర్ పెంచడానికి కేంద్రం చర్యలు చేపట్టనున్నది. అదే జరిగితే డీఏ 31%, డీఆర్ 31% పెరుగనున్నది. ఈ నెలాఖరులోగా కేంద్రం ప్రకటన చేయొచ్చు. అక్టోబర్ వేతనం నుంచి అమలులోకి రావచ్చునని భావిస్తున్నారు.
కేంద్రం ఉద్యోగులకు 28 శాతం డీఏ పెంచడంతో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు అదే శ్రేణిలో వేతనాలు పెంచాయి. దీంతో ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, అసోం, జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. కర్ణాటక మాత్రం 21.5 శాతం డీఏ మాత్రమే పెంచింది.
28 శాతం డీఏ పెంచడంతో కనీస వేతనం రూ.20 వేలు ఉండేదీ.. తాజాగా మూడు శాతం పెంచడం వల్ల మరో 600 కనీస వేతనంలో కలుస్తుంది. దీని ప్రకారం వేతనంలో రూ.6,200 పెరుగనున్నదని అంచనా వేస్తున్నారు.