మేయర్ వై సునీల్రావు
నగరంలో మొదటి రోజు వార్డు కమిటీ సమావేశాలు
కార్పొరేషన్, జూలై 1: నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం వేదికగా నిలుస్తుందని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 60 డివిజన్ల్లలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, ప్రత్యేకాధికారులు ప్రజలతో కలిసి వార్డు కమిటీ సమావేశాలు నిర్వహించి, సమస్యలపై చర్చించారు. కాగా, 33వ డివిజన్లో నిర్వహించిన వార్డు కమిటీ సమావేశంలో మేయర్ వై సునీల్రావు పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. ఇక్కడ డివిజన్ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.
హరిత నగరంగా తీర్చిదిద్దాలి
కరీంనగర్ను హరితనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్ కోరారు. 37వ డివిజన్లో పట్టణ ప్రగతిలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. డివిజన్ నాయకులు, ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి విజయవంతం చేయాలి
నగరంలో చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ క్రాంతి కోరారు. నగరంలోని 42, 50వ డివిజన్లలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కమిషన్ మాట్లాడుతూ, పట్టణ ప్రగతిలో భాగంగా ఖాళీ స్థలాలు, మురుగు కాలువలను శుభ్రం చేయిస్తామన్నారు. ఎక్కడ కూడా చెత్త పేరుకపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ మేచినేని వనజాఅశోక్రావు, నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
డివిజన్లలో..
పట్టణ ప్రగతిలో భాగంగా 60 డివిజన్లలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో వార్డు కమిటీ సమావేశాలు నిర్వహించారు. సమస్యలపై చర్చించారు. 3వ డివిజన్లో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ అధ్యక్షతన ర్యాలీ తీసి, వార్డు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కాలనీవాసులు శ్రీరాములు, శంకర్ ప్రసాద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అలాగే, 36వ డివిజన్లో కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి, వార్డు కమిటీ సమావేశం నిర్వహించారు. డివిజన్లో చేపట్టే పారిశుధ్య పనులు, తదితర విషయాలపై చర్చించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేశ్, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, జూలై 1: 8వ డివిజన్ (అల్గునూర్)లో కార్పొరేటర్ సల్ల శారదారవీందర్, ప్రత్యేకాధికారి మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు కమిటీ సమావేశం నిర్వహించారు. కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జి జాప శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జాప రవీందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూలై 1: పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు కోరారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సంఘం చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అన్ని వార్డుల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. కమిషనర్ వేణుగోపాల్, కౌన్సిలర్లు మొండయ్య, అంజలి, వేణుగోపాల్, విజయ, ఎస్కే నాజియా, రాంబాబు, సీహెచ్ సత్యనారాయణరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ప్రభాకర్, ఫక్రొద్దీన్, షహనాజ్, మమత పాల్గొన్నారు.