Guidelines to E-commerce | కరోనా సంక్షోభం ఫలితంగా ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగిపోయాయి. దీంతో కన్జూమర్ల ప్రయోజనాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఈ-కామర్స్ సంస్థలను కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) తెలిపింది. అందుకోసం తమ విక్రేతల పూర్తి వివరాలను కన్జూమర్లకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. విక్రేతల చిరునామాతోపాటు ఫిర్యాదులు చేసేందుకు అధికారుల వివరాలను కొనుగోలుదారులు కొనే ప్రొడక్ట్స్తో అందజేయాలని తెలిపింది. ఈ విషయమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలకు గైడ్లైన్స్ సీసీపీఏ జారీ చేసింది.
చట్టం ప్రకారం కొన్ని ఈ-కామర్స్ సంస్థలు ఈ వివరాలను అందుబాటులో ఉంచడం లేదని ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ మార్గదర్శకాలు జారీ చేశామని సీసీపీఏ తెలిపింది. ఈ గైడ్లైన్స్ పాటించకుంటే చర్యలు తప్పవని సీసీపీఏ కమిషనర్ అనుపమ్ మిశ్రా స్పష్టం చేశారు.