సీఎం కేసీఆర్ ముందుచూపుతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి దిశగా పయనం
రాయసముద్రం చెరువు అభివృద్ధే ధ్యేయం
శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి
రామచంద్రాపురం, జూన్ 13 : సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధిలో పురోగమిస్తున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. ప్రొటెం చైర్మన్గా భూపాల్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆదివారం మొదటిసారి సొంత గ్రామం ఆర్సీపురానికి రావడంతో డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ ఘన స్వాగతం పలికారు. ముందుగా ఓల్డ్ ఆర్సీపురంలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ పుష్పానగేశ్ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డికి హారతిపట్టి అక్కడి నుంచి రాయసముద్రం చెరువు కట్టపై ఉన్న పోచమ్మ ఆలయం వరకు సన్నాయిమేళంతో పాదయాత్రగా వెళ్లారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, మెట్టు కుమార్యాదవ్తో కలిసి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్పొరేటర్ పుష్పానగేశ్ దంపతులు ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని గజమాలతో సత్కరించారు. కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి నివాసంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రొటైం చైర్మన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం నంబర్వన్ స్థానంలో నిలుస్తున్న దన్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీగా ఉన్న తనకు ప్రొటెం చైర్మన్గా బాధ్యతలు అప్పగించి సీఎం కేసీఆర్ తన మరింత బాధ్యతను పెంచారన్నారు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
తాను ఈ రోజు ఇంతటి వాడిని కావడానికి ఆర్సీపురం ప్రజల ఆశీర్వాదమేనని తెలిపారు. ఆర్సీపురం డివిజన్లోని రాయసముద్రం చెరువును అభివృద్ధి చేయడమే ధ్యేయమన్నారు. కార్పొరేటర్ పుష్పానగేశ్ దగ్గరుండి చెరువు అభివృద్ధి పనులను వేగంగా జరిపిస్తునందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న భూపాల్రెడ్డికి ప్రొటెం చైర్మన్గా సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. మూడు సార్లు భూపాల్రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుడు మోహన్రెడ్డి చెరువు మధ్యలో గౌతమ బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, ఎంపీపీ దేవానంద్, డివిజన్ అధ్యక్షుడు పరమేశ్యాదవ్, గ్రంథాలయ డైరెక్టర్ కుమార్గౌడ్, మాజీ ఎంపీపీ యాదగిరి, మాజీ సర్పంచ్లు రాజేశ్వర్రెడ్డి, సోమిరెడ్డి, కౌన్సిలర్లు లచ్చిరాం, శ్రీశైలం, ఆదర్శ్రెడ్డి, నగేశ్, గఫర్, ఖదీర్, నర్సింహ, జగన్నాథ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఐలేశ్, కుత్బుద్దీన్ పాల్గొన్నారు.