పరిశోధనలపై సంతృప్తి
డిచ్పల్లి, జూన్ 7: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలను వైస్ చాన్స్లర్ ఆచార్య డి.రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సోమవారం సందర్శించారు. మొదటగా ఆయా విభాగాలధిపతులను అడిగి అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, బోధనా తరగతులు, ప్రయోగశాలలు, పరిశోధకులు, విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాజెక్టు వర్క్స్, పరిశోధనల వివరాలపై ఆరా తీశారు. వివిధ దేశాలలోని విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల, విద్యార్థుల పరిశోధనలు, సాధించిన అవార్డులు, ప్రచురించిన వ్యాసాలు, ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్, పేటెంట్ హక్కుల వివరాలను తెలుసుకున్నారు.
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ వివరాలను విభాగాధిపతి ఆచార్య నసీం వీసీకి వివరించారు. డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ శిరీష బోయపాటి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ అపర్ణ, డాక్టర్ శరత్కుమార్, డాక్టర్ రామేశ్వర్, గోపినాథ, నర్సయ్య, రమ్యశ్రీ, శ్రీకాంత్, వసుధ, విజయ, తిరుపతి తదితర సిబ్బందిని ఆమె వీసీకి పరిచయం చేశారు. ఆర్గానిక్ అండ్ ఫార్మా కెమిస్ట్రీ వివరాలను విభాగాధిపతి డాక్టర్ బాలకిషన్ వీసీకి తెలిపారు. డాక్టర్ నాగరాజు, డాక్టర్ సాయిలు, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ డేనియల్, డాక్టర్ గంగాకిషన్, డాక్టర్ సురేశ్, రఘువీర్, గంగాధర్ తదితర సిబ్బందిని వీసీకి పరిచయం చేశారు. ఈ రెండు విభాగాలను సందర్శించిన వీసీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా విభాగాలలో జరుగుతున్న పరిశోధనలు, ప్రాజెక్టులను తెలుసుకొని ప్రశంసించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఉమారాణి, కార్యాలయ సిబ్బందిని ప్రిన్సిపాల్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ పరిచయం చేశారు.
వీసీకి సన్మానం..
టీయూ వీసీని హాస్టల్స్ చీఫ్ వార్డెన్ డాక్టర్ జమీల్ అహ్మద్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సోమవారం వేర్వేరుగా కలిసి సన్మానించారు. వీసీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. వీసీని కలిసిన వారిలో సూపరింటెండెంట్ ఉమారాణి, కేర్ టేకర్లు,ఔట్ సోర్సింగ్ సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్, కార్యదర్శి బికోజి, సిబ్బంది ఉన్నారు.
వైవా వోస్కు హాజరైన వీసీ..
పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న గురునానక్దేవ్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి కునాల్ పబీబ్ సిద్ధాంత గ్రంథంపై సోమవారం ఉదయం నిర్వహించిన పీహెచ్డీ ఆన్లైన్ (వర్చువల్) వైవా వోస్ (మౌఖిక పరీక్ష)కు ఎక్స్ట్రనల్ ఎగ్జామినర్గా టీయూ వీసీ హాజరయ్యారు. కునాల్ పబీబ్ను తన పరిశోధానాంశంపై వివిధ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. తదనంతరం పీహెచ్డీ డాక్టరేట్ను కునాల్ పబీబ్కు ఇవ్వాల్సిందిగా గురునానక్ దేవ్ యూనివర్సిటీకి వీసీ సిఫారసు చేశారు.