బొడ్రాయిబజార్, మార్చి 27 : పన్ను చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న వారి ఇండ్లు, షాపులను సీజ్ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి తెలిపారు. పట్టణంలోని జమ్మిగడ్డకు చెందిన ముత్యాల వెంకటాచారి కట్టెల మండికి 2002-03 నుంచి ఇంటి పన్ను బకాయి రూ.2,54,185 చెల్లించాల్సి ఉంది. తిరిగినా పన్ను చెల్లించకపోవడంతో రెడ్ నోటీసు జారీ చేశారు. అయినా మున్సిపల్ ట్యాక్స్ ఫోర్స్ సిబ్బంది షాపును సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు మున్సిపాల్టీకి చెల్లించాల్సిన ఇంటి పన్ను, నల్లా బిల్లు బకాయిలను వెంటనే చెల్లించి ఇండ్లు జప్తు కాకుండా, నల్లా డిస్ కనెక్షన్ కాకుండా చూసుకోవాలన్నారు. జ్ఞానేశ్వరి, ఆర్ఐ శివరాంరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్ జానీమియా
వైకుంఠధామం పరిశీలన : పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు పక్కన నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ ఏఈ ఎస్ఐ సారగండ్ల శ్రీనివాస్
నేడు మున్సిపల్ సమావేశం : మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ పాలకవర్గ సమావేశం కమిషనర్ పి.రామానుజులరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసనసభ సమావేశాలున్నప్పుడు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎంపీ, ఎమ్మెల్యేలకు వెసులుబాటు ఉన్న రోజుల్లో మున్సిపల్ సమావేశాలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అందుకే ఆదివారం ఉదయం మున్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.