హైదరాబాద్, ఏప్రిల్ 22: ఫోర్బ్స్ ‘30 అండర్-30’ ఆసియా జాబితాలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులకు చోటు లభించింది. వీరిలో మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్ సీఈవో ప్రణవ్ వెంపటి, డిజీ-ప్రిక్స్ వ్యవస్థాపకుడు సమర్థ్ సింధీ ఉన్నారు. కృత్రిమ అవయవాల తయారీలో నిమగ్నమైన హైవ్ ఇన్నోవేషన్స్ సంస్థ.. ‘కల్ఆర్మ్’ పేరుతో బయోనిక్ హ్యాండ్ను తయారుచేసి చాలా తక్కువ ధరకే అందిస్తున్నది. ఈ కృతిమ చేతితో టైపింగ్ సహా అన్ని పనులు చేయవచ్చు. మరోవైపు ఆన్లైన్ ఫార్మసీ సేవల స్టార్టప్ డిజీ-ప్రిక్స్.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు మందులను హోమ్ డెలివరీ చేస్తున్నది. వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రిస్క్రిప్షన్లను అప్లోడ్ చేసిన రోగులకు నెలవారీ మందులను ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఈ మందుల ధరలు స్థానిక మార్కెట్ల కంటే 15 శాతం తక్కువగా ఉంటాయి. బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన సమర్థ్ సింధీ.. భారత్కు తిరిగి రావడానికి ముందు అమెరికన్ హెల్త్కేర్ కంపెనీలో పనిచేశారు.