కవాడిగూడ, జూన్ 21: సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యల వల్లనే రాష్ట్రంలో కరోనా తగ్గు ముఖం పట్టిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి రావడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం లాక్డైన్ను ఎత్తివేసిందన్నారు. ఈ మేరకు సోమవారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ గైడ్స్ పాఠశాలలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పొదుపు సంఘాల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో ఉన్న 9 వేలకు పైగా ఉన్న పొదుపు సంఘాల మహిళల్లో దాదాపు 5 వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ రవీందర్, హనుమాన్ టెంపుల్ చైర్మన్ వల్లాల శ్యామ్యాదవ్, యూసీడీ రత్నరాణి, లక్ష్మీగణపతి గుడి చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, సాయి చైతన్యరెడ్డి, వైద్యసిబ్బంది మంగ, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.