న్యూఢిల్లీ: ప్రముఖ చమురు సంస్థ వేదాంతా అనుబంధ సంస్థ కెయిర్న్ ఇండియా మెట్టు దిగి వచ్చింది. వెనుకటి తేదీ (రిస్ట్రోస్పెక్టివ్ ట్యాక్స్) పన్ను చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం సవాల్ చేయడంతోపాటు సానుకూల ఆదేశాలు తెచ్చుకున్నది.
హేగ్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఆదేశాలను కేంద్రం గౌరవిస్తే 500 మిలియన్ల డాలర్లు చెల్లించడానికి సిద్ధం అని ముందుకువచ్చింది. రాజస్థాన్లోని బర్మార్లోని ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ బ్లాక్లో గడువు దాటిన తర్వాత కార్యకలాపాలను కొనసాగించేందుకు అనుమతులు పొందింది.
దీనిపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో భారత్లోని ఆస్తుల జప్తునకు కెయిర్న్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయినా వెనుకటి తేదీ నుంచి పన్ను చెల్లించాల్సి వస్తే తమకు నష్టం వాటిల్లుతుందని కెయిర్న్ వాదిస్తున్నది.
అయినా ప్రభుత్వం హేగ్ కోర్టు ఆదేశాలను గౌరవిస్తే.. భారత ప్రభుత్వం గుర్తించిన సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టు లేదా ఏదేనీ ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలో 500 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అని సంకేతాలిచ్చింది.
1994లో భారత్లోని ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో ఈ స్కాటిష్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. దశాబ్ద కాలం తర్వాత బార్మార్లో భారీగా ఆయిల్ నిల్వలు ఉన్నట్లు కనుగొంది. 2006-07లో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీగా కెయిర్న్ ఇండియా చేరింది.
ఐదేండ్ల తర్వాత కేంద్రం రెట్రోస్పెక్టివ్ టాక్స్ లాను ఆమోదించింది. దీని కింద కెయిర్న్కు వడ్డీ ప్లస్ పెనాల్టీతో కలిపి రూ.10,247 కోట్లు చెల్లించాలని బిల్లు ఖరారు చేసింది. కెయిర్న్ ఇండియా ఆస్తులు, ఫండ్స్, ఇతర ఆదాయ మార్గాలను జప్తు చేసింది కేంద్రం. దీనిపై హేగ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కెయిర్న్ ఇండియా.
హేగ్ న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వచ్చినా వివాద్ సే విశ్వాస్ కింద వివాద పరిష్కారానికి కెయిర్న్ ఇండియా ముందుకు వచ్చింది. దీని ప్రకారం 50 శాతం చెల్లిస్తే సరి. దీంట్లో కేంద్రం జప్తు చేసిన కెయిర్న్ ఆస్తులు రూ.2,500 వెనక్కు ఇవ్వడానికి అంగీకరిస్తే రూ.7,600 కోట్లు చెల్లించడానికి సరేనన్నది.
బ్రిటన్-ఇండియా ద్వైపాక్షిక ఒప్పందాలను కేంద్రం ఉల్లంఘించిందని హేగ్ న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. అయినా, వివాద్ సే విశ్వాస్ కింద సమస్య పరిష్కారానికి సంబంధించి కెయిర్న్, కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పందించడానికి నిరాకరించారు.
ఇప్పటి వరకు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు మూడు దఫాలు ముఖాముఖీ సమావేశం అయ్యారు. ఒకసారి వీడియో కాల్ ద్వారా చర్చించినట్లు సమాచారం. ఇరువైపులా సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే హేగ్ న్యాయస్థానంలో అనుకూల తీర్పుతో తొమ్మిది దేశాల్లో భారత్ ఆస్తుల జప్తు కోసం కెయిర్న్ ఇండియా పిటిషన్లు దాఖలు చేసింది.
ఆ జాబితాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, సింగపూర్, కెనడాలోని క్యూబే ప్రావిన్స్ ఉన్నాయి. భారత్కు చెందిన ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆస్తులను ఈ పిటిషన్లలో చేరినట్లు తెలుస్తున్నది.
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన